ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దాదాపు 70 స్థానాల్లో తొలి రౌండ్, మరో 20కిపైగా స్థానాల్లో రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగా, 70కి పైగా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఫ్యాన్ గాలికి ఎదురు లేకుండా పోయతోంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కుప్పంలో వైసీపీ అభ్యర్ధి చంద్రమౌలికంటె బాబు వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్లో కూడా చంద్రబాబు వెనుకబడిపోయారు.
చిత్తూరు జిల్లాలోని కుప్పం నుండి చంద్రబాబునాయుడు వరుసగా విజయం సాధిస్తున్నారు. కానీ, ఈ దఫా మరోసారి చంద్రబాబునాయుడు ఇదే స్థానం నుండి పోటీ చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడుపై పోటీ చేసిన ఐఎఎస్ అధికారి చంద్రమౌళి కూడ బరిలో ఉన్నారు. చంద్రమౌళి చేతిలో చంద్రబాబునాయుడు వెనుకంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధికి 4456 ఓట్లు వస్తే టీడీపీకి 4389 ఓట్లు దక్కాయి.