Thursday, April 25, 2024
- Advertisement -

బాబు, లోకేష్‌ల‌పై మ‌రో సెటైర్ పేల్చిన విజ‌య‌సాయిరెడ్డి….

- Advertisement -

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ బాబుకు నిద్రలేకుండా చేస్తున్నారు. మొద‌టినుంచి కూడా సోష‌ల్ మీడియాలో విజ‌య‌సాయి దూకుడుగా వ్వ‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బాబు, లోకేష్‌ల‌పై మ‌రో సారి ట్విట్ట‌ర్‌లో రెచ్చిపోయారు.

మంగళగిరి నుంచి పోటీచేసిన లోకేశ్ ఓడిపోతారని ముందే తెలిసి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే బాబు తనవారికి పోస్టింగులు, పదోన్నతలు ఇచ్చారని దుయ్యబట్టారు. అప్పులు చేసి మరీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, ఇప్పుడేమో ఓటమికి కారణాలు తెలియడం లేదని నంగనాచి డ్రామాలు ఆడుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారు. ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారు. తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గు లేకుండా డిమాండు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మాట తప్పిన చంద్రబాబును రైతులు నిలదీయాలి’అని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -