వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన నేత లక్ష్మినారాయణల మధ్య ట్విట్టర్ జరగుతోంది. రెండు రోజుల క్రితం జనసేన పోటీచేసేందే 65 స్థానాలైతే.. 88సీట్లు ఎలా వస్తాయని.. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగా అంటూ… వెటకారంగా ట్వీట్ చేశారు విజయసారి.
విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్కి లక్ష్మీనారాయణకూడా ఘాటుగానె కౌంటర్ ఇచ్చారు. ‘గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, @JanaSenaParty పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14.అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది.మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
మరో ట్వీట్ లో..‘‘మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.’’ అని పేర్కొన్నారు.
లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్కు మరో సారి విజయసాయిరెడ్డి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.జనసేన పార్టీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమిటో తనకు తెలిదని, లెక్కలు తికమకగా అనిపిస్తే చంద్రబాబు దగ్గరకు ట్యూషన్ కు వెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు.
తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన విజయసాయి, “జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్ బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్కు వెళ్ళండిష అంటూ ఘాటైన పంచ్ ఇచ్చారు.