దాదాపు 20కు పైగా కేసులు, హైకోర్టులో పిటీషన్లు దాఖలైనా.. ఒక్కదాంట్లో కూడా చంద్రబాబు ఎందుకు ఇరుక్కోలేదు. అంటే సామాన్యులు సమాధానం చెప్పలేని పరిస్థితి. కానీ చంద్రబాబు ప్రత్యర్థులు మాత్రం దీనిపై చెబుతుంటారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి తనపై కేసులు లేకుండా.. నిలువకుండా చేసుకుంటారని.. అధికారంలో ఉన్నప్పుడు కేసులు నిలవకుండా కాపాడుకుంటూ ఎల్లో మీడియా అండతో కుంభకోణాలను తొక్కిపెట్టే చంద్రబాబు నైజంపై తాజాగా విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్రలను బయటపెట్టారు. అధికారంలో ఉన్నన్నీ నాళ్లు చంద్రబాబు తన దోపిడీని బయటపడకుండా కాపాడిన ఎల్లో మీడియా ఇప్పటికీ ఆయనకు బానిసగానే బతుకుంతోందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
ఎల్లో మీడియాతో ఎంత కవర్ చేసినా చంద్రబాబు, ఆయన అనుయాయుల దోపిడీ ఆగదని.. సోషల్ మీడియా పవర్ ఫుల్ గా మారాక మీరెంత మూసుకున్నా అది రెప్పవాల్చదు అంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఆర్థికమంత్రి యనమల తీరును తూర్పార పట్టారు విజయసాయిరెడ్డి.. ‘ ఏపీ ఆర్థిక మంత్రిగా రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కినెట్టిన యనమల ఎన్నికల ముందు కూడా ఇలానే కేసీఆర్, మోడీలతో జగన్ చేతులు కలిపితే ఏపీకి అన్యాయం అని ఆరోపించాడని.. అప్పుడే జనాలు మీపై తుపుకున్న ఉమ్మేశారు మరిచిపోయారా?’ అంటూ యనమలపై ఉవ్వెత్తున నిప్పులు కురిపించాడు విజయసాయిరెడ్డి