Saturday, April 20, 2024
- Advertisement -

ఇత‌ర పార్టీల‌తో విడాకులివ్వ‌డం పెళ్లి చేసుకోవ‌డం బాబుకు అల‌వాటే..

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై మ‌రో సారి ఫైర్ అయ్యారు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య్‌జ‌సాయిరెడ్డి. రాజకీయ పార్టీలు, కూటములకు విడాకులు ఇవ్వడం, మళ్లీ మళ్లీ కలిసిపోవడం చంద్రబాబుకు అలవాటేనని ఆయ‌న ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీల రహస్య భేటీలు, ప్యాకేజీ సాధన కోసం జరుగుతోన్న ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే తిరిగి బీజేపీతో రీయూనియన్‌ అయ్యేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు

నాలుగేళ్ల పాలనలో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి వ్యవహారాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే బీజేపీకి తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమాల్లో మాదిరి ఆయన చేస్తోన్న డబుల్‌, ట్రిపుల్‌ యాక్షన్లను ప్రజలు గమనిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన బాబుకు జనం బుద్ధిచెప్పేరోజు ఎంతో దూరంలోలేద‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -