గత కొద్ది రోజులుగా నారా లోకేష్ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్లతో విరుచుకు పడుతున్నారు. లోకేష్ చేస్తున్న ట్వీట్లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు అభిజ్ఞా పక్షపాతంతో(కాగ్నిటివ్ బయాస్) ఉంటారని సైకాలజీ చెబుతోందని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిని డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని పిలుస్తారని.. లోకేశ్కు కూడా ఇదే సమస్య ఉందని చెప్పారు.తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు” అని అన్నారు.
మరో వైపు అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంక్ రుణం నిలిపి వేడయంపై కూడా ట్విట్టర్లో స్పందించారు.అమరావతి ఒక స్కామ్ల పుట్ట అని గుర్తించే.. వరల్డ్ బ్యాంకు రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపి వేసిందన్నారు. రియల్ ఎస్టేట్కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కి.మీ రోడ్డుకు రూ. 1872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అది పెద్ద కుంభకోణంగా బ్యాంక్ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.