Friday, April 19, 2024
- Advertisement -

కడప మొత్తం వైకాపా క్లీన్ స్వీప్…… జ్యోతి సర్వేలో వెల్లడైన నిజం

- Advertisement -

పులివెందులలో గెలుస్తాం అని డప్పాలు కొట్టిన చంద్రబాబుకు దిమ్మతిరిగే నిజాలను ఆంధ్రజ్యోతి సర్వే బయటపెట్టింది. అధికారికంగా ఈ విషయాలన్నీ స్వయంగా ఆంధ్రజ్యోతి మీడియానే బయటపెట్టింది. ఇప్పుడు ఈ వివరాలే టిడిపిలో కాక రేపుతున్నాయి. అసలే గోదావరి జిల్లాల్లో ఈ సారి 2014లో గెలిచిన మూడొంతుల సీట్లలో ఓటమి ఖాయం అన్న విషయం తేలిపోయింది. ఇప్పుడు తాజాగా కడపలో ఆంధ్రజ్యోతి వారు నిర్వహించిన సర్వేలో టిడిపికి ఒక్క సీటు కూడా రాదన్న నిజం బయటపడింది.

ఆ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పలేని ఆంధ్రజ్యోతి ఇండైరెక్ట్‌గా చెప్పేశారు. నేతల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడిందని, టిడిపి నేతలెవ్వరూ చిత్తశుద్ధితో పనిచేయడంలేదని నానా రకాల కారణాలూ చెప్తూ వార్తను ఇచ్చేశారు. గెలిస్తే చంద్రబాబు కారణం, ఓడితే మాత్రం టిడిపిలో ఉన్న ఇతరులు అందరూ కారణం అనేలా వార్తలు ఇవ్వడం పచ్చ మీడియాకు అలవాటే. ఇప్పుడు కూడా కడపలో అన్ని సీట్లలోనూ టిడిపి ఓడిపోయే పరిస్థితిలో ఉండడానికి ఆ జిల్లాలో ఉన్న నేతలే కారణమని విశ్లేషించారు. అయితే స్వయంగా టిడిపి పాంప్లెట్ అయిన ఆంధ్రజ్యోతిలోనే కడప జిల్లాలో టిడిపికి ఒక్క సీటు కూడా గెలిచే సీన్ లేని విషయం వార్తగా రావడంతో తెలుగు తమ్ముళ్ళు, నాయకులు టెన్స్ అవుతున్నారు. పులివెందులలో కూడా గెలుస్తాం అని చంద్రబాబు చెప్పిన మాటలన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే అని చర్చించుకుంటున్నారు. కడప జిల్లాలో కనీసం అడుగుపెట్టలేని స్థితిలో, ఒక్క సీటు కూడా గెలవలేని స్థితిలో టిడిపి ఉంటే 2019 ఎన్నికల గెలిచి అధికారం సాధిస్తామని ఎలా భ్రమల్లో బ్రతకగలం అన్న ఆందోళన టిడిపి నేతల్లో కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -