Wednesday, April 24, 2024
- Advertisement -

ఫృథ్వీ, పోసాని.. ఇప్పుడు రాజేంద్రప్రసాద్..

- Advertisement -

ఏపీ సీఎంగా జగన్ అవ్వడం టాలీవుడ్ పెద్దలకు ఇష్టం లేదని.. అందుకే ఒక్కరు కూడా కలవడానికి రావడం లేదని టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత ఫృథ్వీ చేసిన కామెంట్ టాలీవుడ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాటలు మంటలు చెలరేగాయి. టాలీవుడ్ లో సినిమా అవకాశాలు సైతం ఈ వ్యాఖ్యలతో తగ్గిపోయాయని ఫృథ్వీ కామెంట్ చేశారు.

కాగా ఫృథ్వీ వ్యాఖ్యలను అనంతరం విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ఖండించారు. సురేష్ బాబు సహా చాలా మంది పేపర్లలో అభినందించారని.. స్వయంగా కలువకపోయినంత మాత్రాన జగన్ ను టాలీవుడ్ గుర్తించడం లేదన్న మాట కరెక్ట్ కాదని పోసాని కౌంటర్ ఇచ్చారు.

అయితే ఈ వివాదం అక్కడితోనే ఆగిపోలేదు.. తాజాగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ గుర్తించడం లేదని రాజేంద్రప్రసాద్ ను జర్నలిస్టులు ప్రశ్నించగా ఆయన షాకింగ్ కామెంట్ చేశారు..

ఏపీకి సీఎంగా జగన్ కాగానే కలవడానికి టాలీవుడ్ ప్రముఖులు ఏమైనా వ్యాపారులా అంటూ కౌంటర్ ఇచ్చారు. వ్యాపారాలు చేసేవాళ్లకు కాంట్రాక్టులు, ఇతర అర్జంట్ పనులుంటాయి కాబట్టి వెంటనే కలుస్తారని.. టాలీవుడ్ వాళ్లకు అలాంటి ఎలిగేషన్స్ ఏమీ లేవన్నారు. జగన్ కాసింత కుదురుకున్నాక కలుస్తామంటూ రాజేంద్రప్రసాద్ హాట్ కామెంట్ చేశారు. టాలీవుడ్ వాళ్లు వ్యాపారులు కాదంటూ.. వాళ్లకు జగన్ తో పనేంటి అని అర్థం వచ్చేలా రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -