ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. రోజుకు వెలల్లో కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇక వైసీపీలోని కీలక నేతలందరూ వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. నిన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది.
దాంతో పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీలో ముఖ్య నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. టెస్టుల్లో పాజిటివ్ అని తెలడంతో ఆయన క్వారంటైన్ కి వెళ్లారు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
గుంటూర్ జిల్లాలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే అంబటి కావడం గమనార్హం. ఇప్పటికే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోశయ్యలు కరోనా బారిన పడ్డారు. సత్తెనపల్లిలో ఇప్పటి వరకు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు సత్తునపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని అధికారులను అంబటి కోరారు.
ఆ ఇద్దరికి మంత్రి పదవి.. ఉత్తరాంధ్రకు డిప్యూటీ.. జగన్ ప్లాన్ ఇదే..?
సీఎం జగన్ న్యూ లుక్ కు కారణం ఇతనే.. సెల్ఫీ వైరల్..!