Saturday, April 20, 2024
- Advertisement -

అత్తింటి వారిని వదిలేసి తల్లి దగ్గరకు వెళ్ళాలేను : అమృత

- Advertisement -

మారుతీరావు అంత్యక్రియలు తాజాగా ముగిశాయి. శ్మశానవాటికలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మారుతీరావు కుమార్తె అమృత మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీలో ఆస్తికి సంబంధించిన గొడవకు ఉన్నాయి. తన తండ్రి మారుతీరావును బాబాయ్ శ్రవణ్ కొట్టినట్టు తెలిసిందని తెలిపారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తాను చెప్పలేనని పేర్కొన్నారు.

భర్త చనిపోతే భార్య పడే బాధ తనకు తెలుసని చెప్పారు. ఇప్పటికిప్పుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ఉండలేనని, ఆమె వచ్చి తనతో ఉంటానంటే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అత్తింటివారిని వదిలి తల్లి దగ్గరకు వెళ్లడానికి సిద్ధంగా లేనని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి చివరి కోరిక మేరకు శ్మశానవాటికకు వెళ్లానని, అయితే అక్కడ బాబాయ్ శ్రవణ్ కుమార్తె తనను నెట్టేసిందని వాపోయారు.

ప్రణయ్ చనిపోయినప్పుడు తాను ఎంతో బలంగా నిలబడ్డానని.. ఇప్పుడెందుకు నిలబడలేనని ధీమా వ్యక్తం చేశారు. బాబాయ్ శ్రవణ్ నుంచి అమ్మకు ప్రాణహాని ఉందని అమృత ఆరోపించారు. నాడు తన బాబాయ్ రెచ్చగొట్టడం వల్లే తండ్రి తప్పుచేశాడని భావిస్తున్నానని అమృత చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -