Friday, March 29, 2024
- Advertisement -

వైసీపీలో చేరిన ‘యాంక‌ర్ శ్యామ‌ల‌’

- Advertisement -

ఏపీలో రాజ‌యాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. అధికార , ప్ర‌తిప‌క్షాలు నువ్వా నేనా అన్న‌ట్లు ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి. ఈసారి జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అన్ని స‌ర్వేలు చెబుతుండ‌టంతో ఆ పార్టీలోకి వ‌ల‌సలు భారీగా పేరుగుతున్నాయి. రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీకి చెంద‌ని వారు కూడా వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ యాంక‌ర్ సినీ నటి శ్యామల తన భర్త నర్సింహారెడ్డితో కలసి వైసీపీలో చేరారు. సోమవారం ఉదయం వారి జ‌గ‌న్ నివాసంలో భ‌ర్త‌తో కలిసి వెళ్లి మ‌రి పార్టీలో చేరింది శ్యామ‌ల‌.

వారికి పార్టీ కండువా క‌ప్పి మ‌రి పార్టీలోకి ఆహ్వానించారు జ‌గ‌న్. పార్టీలో చేరిన అనంత‌రం శ్యామ‌ల మీడియాతో మాట్లాడింది. వైసీపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపింది శ్యామ‌ల‌. జగన్ అన్నను చాలా కాలంగా చూస్తున్నామ‌ని , ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఏదో చేయ‌ల‌ని త‌ప‌న‌తో ఉన్నార‌ని ఆయన విధివిధానాలు, ఆయన చేస్తున్న మంచి పనులు తనకు ఎంతో నచ్చాయని తెలిపారు. జగన్ చెబుతున్న నవరత్నాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, మద్యపాన నిషేధం, ఆరోగ్యశ్రీ పథకాలు తమకు ఎంతో నచ్చాయని చెప్పారు. ఇటువంటి స‌మ‌యంలో ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డ‌ల‌నే ఉద్దేశంతోనే పార్టీలో చేర‌మ‌ని శ్యామ‌ల చెప్పుకొచ్చింది. జ‌గ‌న్ అన్న‌తో పాటే మేము కూడావైసీపీ ప్రచారంలో పాలుపంచుకోబోతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు వైసీపీకి ఓటు వేసి ఘన విజయాన్ని అందించాలని ఆ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను కోరింది శ్యామ‌ల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -