Friday, March 29, 2024
- Advertisement -

వాక్సిన్ వచ్చేవరకు ఇలానే ఉంటుంది : జగన్

- Advertisement -

ఏపీలో శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కరోనా రాని వ్యక్తి మన సమాజంలో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వాక్సిన్ వచ్చేవరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని.. కలెక్టర్లు మరింతగా దృష్టిపెట్టి ప్రజల్లో చైతన్యం నింపాలని సీఎం జగన్ అన్నారు.

85శాతం మంది ఇంట్లోనే ఉండి కరోనా మందులను తీసుకుంటే తగ్గిపోతుందని.. ఇళ్ళలో ప్రత్యేక గది లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్లో ఉండొచ్చని సీఎం సూచించారు. ప్రతీరాష్ట్రం సరిహద్దులను తెరిచిందని.. కాబట్టి రాకపోకలు పెరిగి అంతర్జాతీయ విమానాలు కూడా తిరుగుతుండటంతో కేసులు పెరుగుతాయని జగన్ ప్రజలను హెచ్చరించారు. కరోనా వైరస్ పై సమీక్షించిన సీఎం.. ఏపీలోని మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ సేవలను విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక రాష్ట్రం ఏపీనని.. ప్రస్తుతం విశాఖ, పశ్చిమగోదావరి – విజయనగరం. గుంటూరు – ప్రకాశం – కడప – కర్నూలు జిల్లాలకు ఆరోగ్య శ్రీ సేవలు విస్తరిస్తున్నట్టు వివరించారు. ఏపీలో వైద్యం కోసం ఎవరూ అప్పుల పాలు కావద్దనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఏపీలో 1.42 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయని.. వాటిని అన్ని జిల్లాల్లో వర్తింపచేస్తామని ప్రజలకు భరోసానిచ్చారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో డబ్ల్యూ.హెచ్.వో మందులను ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

యాత్ర మూవీలో డైలాగ్ ను జగన్ చేసి చూపించారు..!

సీఎం జగన్ తో ముద్రగడ అత్యవసర భేటీ ?

వ్రైవేటులో కూడా కరోనా చికిత్స ఉచితం : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

విడుదల రజని నిర్ణయానికి జగన్ కూడా ఆశ్చర్యపోయారు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -