త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తున్నారు ఐటీ మంత్రి నారాలోకేష్. ఎమ్మెల్సీ ద్వారా మంత్రిగా ఉన్న చినబాబు ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి తన సత్తా ఏంటో చూపించాలని ఉబలాట పడుతున్నారు. అంతా బాగానె ఉంది కాని….ఎన్నికల ప్రచారంలో మాత్రం గతంలో మాదిరి ఆవేశంగా ఏదో మాట్లాడాలనుకోవడం….పప్పులో కాలేయడం నవ్వులు పాలు అవ్వడం చూస్తూనె ఉన్నాం. మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తున్నారు. వారంరోజు క్రితం మంగళగిరి ఎన్నికల ప్రచారంలో 11 న పోలింగ్ అయితే 9న టీడీపీకీ ఓటేయండి అంటూ మాట్లాడి అందరిలో నవ్వుల పాలయ్యారు. అంతేనా మంగళగిరిని మందలగిరి అని… కేసీఆర్ వచ్చి మచిలీపట్నం పోర్టును ఎత్తుకెళ్లిపోతాడని లోకేష్ వ్యాఖ్యానించడం ఇపుడు చర్చనీయాంశం అయింది. ఇలా చెప్పుకుంటూ పోతె చినబాబు నోటి నుంచి జాలువారిని ఆణిముత్యాలు కో కొల్లలు
తాజాగా లోకేష్లో ఉన్న మరో యాంగిల్ బయటికొచ్చింది. ప్రజలు నవ్వుకుంటారన్న జ్ణానం లేకుండా మరో సారి ఎన్నికల ప్రచారంలో వినడానికి కూడా వీలుకాని బూతులు మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యారు.ఈ రోజు ప్రభుత్వం ముందళికెళ్లింది.. ఊ..ఆ.. అంటే..’అని తన వాగ్దాటిని కొనసాగించబోతూ లోకేష్ బాబు ఒక బూతు పదం వదిలారు.
డెంగీ జ్వరం వచ్చేది అని చెప్పబోయి.. అచ్చ తెలుగు నాటు బూతును మాట్లాడారు లోకేష్. డెంగీ జ్వరాన్ని చదువురాని నిరక్షరాస్య జనాలు కూడా అర్థవంతంగా పలుకుతారు. డెంగీ అని, డెంగ్యూ అని.. ఎవరికి తోచినట్టుగా వారు పలుకుతారు. కాని లోకేష్ మాత్రం దాన్ని ఒక వినడానికి వీల్లేకుండా బూతు పదంగా మార్చేశారు. అదేంటో ఈ పాటికి అందరికి అర్థం అయ్యో ఉంటుంది.