ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో భాజాపా, టీడీపీ మధ్య రాజకీయం వేడెక్కుతోంది. కాకినాడలో బాబు కాన్వాయ్ను భాజాపా మహిళా నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. మహిళా నేతలపై బాబు నోరు పారేసుకున్నారు. తర్వాత టీడీపీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
తాజాగా బాబు, లోకేష్లపై కన్నా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడాన్ని ట్విట్టర్లో తప్పుబట్టారు. పోలవరం పేరుతో ప్రభుత్వ ఖజానాను ఖాలీ చేయడం తప్ప ఒరిగిందేమిలేదన్నారు. సోమవారం-పోలవరం, బస్సు యాత్రలను ఆపాలని హితవు పలికారు.
‘@ncbn @naralokesh..సోమవారం-పోలవరం అంటూ, బస్సుయాత్రలంటూ, ప్రారంభోత్సవాలంటూ నాటకాలాడారు. ఇప్పుడు వరల్డ్ రికార్డులంటూ ఆర్భాటం. ప్రజలకు కుచ్చు టోపి పెట్టటానికి ప్రజల సొమ్మునే వృధా చేస్తున్న మీకు సూటి ప్రశ్న..కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పోలవరంలో మీ పాత్ర ఏంటి? బ్రోకరా? కాంట్రాక్టరా?’ అని ట్వీట్ చేశారు.