- Advertisement -
ధర్మపోరాట దీక్షలో ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు బాబు. తమ సత్తా ఏంటో చెప్పడానికే ఢిల్లీ వచ్చామన్నారు. లెక్కలు చెప్పడానికి సిద్దంగా ఉన్నామని….రాష్ట్రం కట్టిన పన్నులకు లెక్కలు చెప్పగలరాని ప్రశ్నించారు. మేం పోరాడేది హక్కుల కోసమే కానీ… మీ భిక్ష కోసం కాదన్నారు. హస్తిన వేదికగా ప్రధాని మోదీపై ఘాటైన విమర్శలు చేశారు. మోదీకి పాలించే హక్కులేదన్నారు. రాష్ట్ర హక్కులకోసం పోరాడుతుంటే మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
మూడురోజుల సమయం ఉంది… ఇప్పటివరకు చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పి… పార్లమెంట్లో ప్రకటన చేయండని సూచించారు. లేదంటే ఏపీ ప్రజలు శాశ్వతంగా బీజేపీని బహిష్కరించే పరిస్థితి వస్తుందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు, విభజన హామీలు సాధించేవరకు మా పోరాటం ఆగదన్నారు సీఎం చంద్రబాబు.