పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై నాకు అనుమానాలున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలా వ్యాక్యానించారో లేదో.. ఇలా చంద్రబాబు వాటిని క్యాచ్ చేశారు. ఈ మధ్య ప్రధాని మోదీని టార్గెట్ చేయడానికి సరైన అంశం లేకపోవడంతో దొరక్క దొరక్క దొరికిన ఛాన్స్ను ఎలా వదులుకోవాలో అనుకున్నారేమో.. ముందు వెనుకా ఆలోచించకుండా మాట్లేడేశారు. పుల్వామా ఉగ్రదాడి మోదీనే చేయించారని అర్థం వచ్చేలా ఓ వ్యాఖ్య చేశారు. పనిలో పనిగా దేశభక్తి చూపించడంలో మనమే ముందుంటామన్నారు.
దీనికి ఉదహారణగా గోద్రా అల్లర్లను ఊటంకించారు. ఆనాడు మోదీని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది నేనే తమ్ముళ్లు అంటూ పార్టీ నేతలకు తెలిపారు చంద్రబాబు. మోదీని ప్రపంచ దేశాలు వెలి వేశాయి.. అబ్బో ఇలా చాలానే మాట్లాడేశారు. కానీ అదే మోదీతో కలిసి నాలుగున్నర సంవత్సరాలు కలిసి పనిచేసిన విషయం మాత్రం చంద్రబాబుకు గుర్తు రాలేదు. కార్యకర్తలు కూడా గుర్తుకు రానట్టే వ్యవహరించారు.
పుల్వామా ఉగ్రదాడి మోదీ ప్రభుత్వం కుట్ర అని చెప్పలేక చెప్పారు చంద్రబాబు. ఆయన అనుకూల మీడియా జనజీవన స్రవంతిలోకి ఈ వ్యాఖ్యలను తీసుకెళ్లడానికి కూడా అంతే కష్టపడింది. రాజకీయ లబ్ధి కోసం మోదీ దేశాన్ని పణంగా పెట్టారు అంటూ చెప్పుకుంటూ పోయింది. ఎందుకో కానీ ఈ వ్యాఖ్యలను హైలేట్ చేయడానికి బయపడినట్టు కనిపించింది. అసలే ఉగ్రదాడిపై ఆగ్రహంతో ఊగిపోతున్న ప్రజల్లోకి ఈ వ్యాఖ్యలు వెళితే తమ ప్రియతమ నేతకు మైనస్ అనుకున్నారేమో తెలీదు కానీ.. మొత్తానికి అలా చెప్పి చెప్పనట్టు చెప్పారు. పనిలో పనిగా ఇక్కడా మమతా బెనర్జీని కూడా వాడేసుకున్నారు చంద్రబాబు. మమతా చేసిన వ్యాఖ్యలను బట్టి తనకు అనుమానంగానే ఉందన్నారు.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విషయాలన్ని చంద్రబాబు మీడియాకు చెప్పలేదు. ఆయన ఏ అధికారులతోనో లేక ఏ పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్లోనే మాట్లాడతారు. దానిని మీడియా ప్రముఖంగా ప్రచురిస్తూ చూపిస్తు ఉంటుంది. మరి మీడియా ముందుకు వస్తే ఏమైనా తేడా కొడుతుందని చంద్రబాబు భయమో ఏంటో తెలీదు మరి. ఈ మధ్య అన్ని విషయాల్లో దీదీని ఫాలో అయ్యే చంద్రబాబు ఈ విషయంలో నెవ్వరు అంటారు. ఆమె మీడియా ముందుకొచ్చి చిల్చి చెండాడితే.. చంద్రబాబు మాత్రం తెరవెనుక అనుకూల మీడియాతో చక్రం తిప్పుతుంటారు.