Thursday, April 18, 2024
- Advertisement -

వైసీపీ ముందరికాళ్లకు బాబు, బీజేపీ బంధం

- Advertisement -

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలోని అక్రమాలను వెలికితీసేందుకు వడివడిగా అడుగులేస్తున్నారు సీఎం జగన్. పోలవరం అక్రమాలు సహా చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలపై సమీక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో వాటి వల్ల అనర్థమని కేంద్రం, టీడీపీ నేతలు చెబుతున్నా వినడం లేదు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా అమరావతిలో మంగళవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ తీరు చూస్తుంటే తన చెట్టును తనే నరుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారని.. కానీ ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని స్వయంగా కేంద్రమంత్రి చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరానికి ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోవడంతో ఇది ఆర్ అండ్ ఆర్ రాష్ట్ర పరిధిలోనేదేనని కేంద్రం చెప్పిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయినా వైసీపీ ఇంత దారుణంగా మాట్లాడడంపై బాబు మండిపడ్డారు.

ఇలా చంద్రబాబు హయాంలోని తప్పులను గుర్తించేందుకు జగన్ వడివడిగా ముందుకెళ్తుండడంతో చంద్రబాబులో ఒకింత ఆందోళన కనిపిస్తోందని తాజా ప్రెస్ మీట్ ను బట్టి అర్థమవుతోంది. కేంద్రం కూడా బాబు హయాంలోని అక్రమాలపై విచారణకు సిద్ధం కాకపోవడం వైసీపీ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -