Thursday, April 25, 2024
- Advertisement -

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

- Advertisement -

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి నుంచి చెబుతున్న మాటే. అందువల్ల చంద్రబాబు ఇప్పటి వరకు చేసిన తప్పులు బయటకు రాలేదు. ఒకటా రెండా ఏకంగా 16 కేసుల్లో చంద్రబాబు తన మీద ఉన్న కేసుల్లో స్టే తెచ్చుకున్నారు అంటే మామూలు విషయమా… చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది.

చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని దాని పై విచారణకు ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండు ఎకరాలు మాత్రమే ఉన్న చంద్రబాబు నేడు వేల కోట్లకు అధిపతిగా మారారు. ప్రతియేట తన ఆస్తులను ప్రకటిస్తూ పైకి కలరింగ్ ఇస్తూనే చేయాల్సిందంతా చేసేశారు. చంద్రబాబు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఎన్టీఆర్ రెండో భార్య వైసిపి నాయకురాలు లక్ష్మీ పార్వతి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన హైకోర్టు చంద్రబాబు ఆస్తులపై విచారణకు ఆదేశించింది.

అయితే ఈ కేసు ఇప్పటిది కాదు. 2005 లోని లక్ష్మీ పార్వతి చంద్రబాబు పై ఏసీబీ విచారణ చేయించాలని కోరారు. కానీ చంద్రబాబు న్యాయవ్యవస్థలో తనకున్న పలుకుబడితో ఈ కేసును విచారణకు రాకుండా అడ్డుకున్నారు. ఆ కేసులో స్టే లు వచ్చేలా ఆర్డర్స్ తెచ్చుకున్నారు చంద్రబాబు. కానీ లక్ష్మీ పార్వతి చంద్రబాబు మాత్రం వదిలేలా కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు పతనం చూడటానికి ఆమె రెడీ అయినట్లు కనిపిస్తోంది. మరోసారి చంద్రబాబు అక్రమాస్తుల కేసును తవ్వి తీస్తున్నారు.

కొన్ని సాక్షాలతో సహా హైకోర్ట్ కు ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసులో మళ్లీ కదలిక మొదలైంది. విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 20 కి వాయిదా వేసింది. మరి ఇప్పటికైనా చంద్రబాబు అక్రమఆస్తులు బయటికి వస్తాయా లేదా ఎప్పటిలాగే బాబు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు చూడాలి.

నమ్మకం కోల్పోయాక కాళ్ళబేరానికి వస్తే ఏం లాభం.?

చంద్రబాబు ఎంత చెప్పిన ఈ ట్రిక్స్ ఆపడా..?

అబ్బో.. అచ్చెన్న వైసీపీకి తొలి సవాల్..?

విడ్డూరం..జగన్ ను పొగుడుతున్న టీడీపీ ఎమెల్యే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -