Friday, March 29, 2024
- Advertisement -

బాబుకు మతి భ్రమించింది…

- Advertisement -

మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ డిప్యూటీ ముఖ్యంత్రి పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. జగన్ ను మిమర్శించే అర్హత బాబుకు లేదన్నారు.వందేళ్లైనా జరగవు అనుకున్న పనులను సీఎం జగన్‌ వంద రోజుల్లోనే చేసి చూపించారని కొనియాడారు. వందరోజుల పాలన చూసి బాబుకు మతి భ్రమించిందని ముందుంది ముసల్ల పండగ అని ఘాటుగా విమర్శలు చేశారు.

అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే లక్షా 33 వేల ఉద్యోగాలిచ్చారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు, పనుల్లో 50 శాతం వాటా ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిది. కల్లోనైనా చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోసం ఆలోచించారా’ అని అన్నారు.

పునరావాస కేంద్రాల పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని పుష్ప శ్రీవాణి విమర్శించారు.నారాయణ కాలేజీల్లో 25 మంది ఆడపిల్లలు చనిపోయినప్పుడు, ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని ప్రభాకర్‌ కొట్టినప్పుడు ఎందుకు పునరావాస కేంద్రాలు పెట్టలేదని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలను కాపాడుకోవడానికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -