Friday, March 29, 2024
- Advertisement -

కోడెల పల్నాటి పులి అయితే…చంద్రబాబు నక్క..మంత్రి కొడాలి నాని ఫైర్

- Advertisement -

కోడెల మృతిపై టీడీపీ చేస్తున్న శవరాజకీయాలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. నిన్నటి నుంచి బాబు చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కోడెలమృతిపై చంద్రబాబునాయుడు మీద కేసు పెట్టాలంటూ మంత్రి కొడాలి నాని కెసియార్ ను డిమాండ్ చేశారు. కోడెల మృతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కొడాలి స్పష్టం చేశారు.

కోడెలపై వైసీపీ నేతలు ఎవరూ కేసులు పెట్టలేదని టీడీపీ వారె కేసులు పెట్టారన్నారు. పోలీసులు సైతం కోడెలను ఏనాడు వేధించలేదని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు పెట్టిన కేసులకు వైసీపీకి సంబంధం ఏంటని బాబు ప్రశ్నించారు.కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో చంద్రబాబు నాయుడును విచారించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడును ఏవన్ కింద కేసు నమోదు చేసి ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నక్కజిత్తులు, శవరాజకీయాలు ప్రజలందరికీ తెలుసునన్నారు.

కుటుంబ సభ్యులు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూరం పెట్టడంతో తట్టుకోలేక మృతి చెందాడని ఆరోపించారు.పార్టీకోసం అహర్నిశలు శ్రమించిన కోడెలను చంద్రబాబు నాయుడు దూరం పెట్టి వేధించింది వాస్తవం కాదా అని నిలదీశారు.కోడెల నరసరావుపేట టికెట్ అడిగితే సత్తెనపల్లి టికెట్ ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఇటీవల కాలంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెలకు వ్యతిరేకంగా గ్రూపు నడిపిస్తోంది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు.

అధికారంలో ఉన్నపుడు కోడెలతో దురాగతాలన్నింటినీ చేయించింది చంద్రబాబు, నారా లోకేషే అంటూ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నపుడు తాను చేసిన పనులకే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కోడెల పర్యవసానాలను అనుభవిస్తున్నట్లు కొడాలి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కోడెలకు చంద్రబాబు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

కోడెలపై చంద్రబాబుకు నిజంగానే ప్రేమ ఉన్న వ్యక్తి అయితే వైసిపి ప్రభుత్వం కోడెలను వేధిస్తోందని చంద్రబాబు ఒక్కసారికూడా స్పందించలేదన్నారు.కోడెల ఆత్మహత్య చేసుకున్నది చంద్రబాబు వల్లే అంటూ కొడాలి అభిప్రాయపడ్డారు. కోడెల మరణం వెనుక ఉన్న వాస్తవాలు బయటకు రావాలంటే ముందు ఆయన మొబైల్ కాల్ డేటాను పరిశీలిస్తే తెలుస్తుందన్నారు.

బతికి ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వని చంద్రబాబు చనిపోయిన తర్వాత శవంపక్కన కూర్చుని మెుసలి కన్నీరు కారుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కోడెల పల్నాటి పులి అయితే బాబు నారా నక్క అంటూ సెటైర్లు వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -