ఏపీలో ఎన్నికలు చిన్న,చిన్న ఘటనలతో ప్రశాంతగా ముగిశాయి. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలు కూడా పొగొట్టుకున్నారు. ఇక ఎన్నికల్లో భారీ పోలీంగ్ జరగడంతో విజయంపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ, వైసీపీ. జనసేన, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి ప్రధానంగా పోటీ వైసీపీ, టీడీపీ పార్టీలపైన నెలకొంది. ఇరు పార్టీలు తమదై విజయం అని ధీమాగా చెబుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని చాలామంది ఆశిస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలతో కురుకుపోయిందని , దానివల్ల ప్రజల్లో టీడీపీ నమ్మకం కోల్పోయిందని అంటున్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పెద్ద తలకాయలే ఓడిపోతున్నారని బెట్టింగులు కడుతున్నారు. ఈ లిస్ట్లో టీడీపీ మంత్రులు కూడా ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ మంత్రులు ఓడిపోతున్న లిస్ట్ను ఓ సారి చూద్దాం. నీటీ పారుదల శాఖ మంత్రి అయిన దేవినేని ఉమమహేశ్వరరావు. ఈ ఐదు సంవత్సరాల్లో దేవినేని ఉమమహేశ్వరరావు సంపాదించినంతగా మరో వ్యక్తి సంపాదించలేదని సొంత నియోజిక వర్గ ప్రజలే చర్చించుకుంటున్నారు. ఓడిపోయే లిస్ట్లో దేవినేని ఉమ పేరు మొదటి స్థానంలో ఉందని సమాచారం.
నారా లోకేశ్.. చంద్రబాబు తనయుడిగా ఎటువంటి అర్హతలు లేకుండానే మంత్రిగా స్థానం సంపాదించాడు. కనీసం తాను పోటీ చేస్తున్న నియోజిక వర్గం పేరు కూడా సరిగ్గా పలకడం రాని నారా లోకేశ్ తాను ఎదుర్కొంటున్న మొదటి ఎన్నికల్లోనే ఓడిపోయవడం ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పరిటాల శ్రీరామ్. అచ్చం నాయుడు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, సుజయకృష్ణా రంగరావు, గల్లా జయదేవ్,చిన్న రాజప్ప,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,కాల్వ శ్రీనివాసులు,అఖిల ప్రియ,ఆదినారయణ రెడ్డి, మొదలగు వారికి ఓటమి తప్పదని తెలుస్తోంది. ఫలితాలు విడుదల అయ్యే వరకు అభ్యర్థుల్లో టెన్షన్ తప్పేలా లేదు.
- Advertisement -
టీడీపీలో ఓడిపోయ్యే మంత్రుల లిస్ట్ ఇదేనట..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -