- Advertisement -
కొద్దిరోజులుగా మంత్రి అఖిలప్రియ పార్టీ వీడుతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. వైసీపీ లేదా జనసేన లోకి వెల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీని వీడే ప్రసక్తే లేదని మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు.
నియోజక వర్గ అభివృద్ధికి బాబు అడిగినన్ని నిధులు ఇస్తున్నాప్పుడు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ మారుతన్నానన్న వార్తలు అన్నీ ఊహాగానాలేనన్నారు. జనసేనలోకి వెల్లేంత ఖర్మ తనకు పట్టలేదన్నారు. త్వరలో జరగ బోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. తమ అనుచరులను పోలీసుల వేధిస్తున్నారనే సెక్కూరిటీని వనక్కిపంపానన్నారు. ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకెల్తానన్నారు.