Friday, March 29, 2024
- Advertisement -

పాతపగలు అన్ని మరిచిపోయి బాబు పీచేముడ్

- Advertisement -

అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబుది అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అధికారం కోసం ఏమైనా చేసే శక్తిసామర్థ్యాలు చంద్రబాబుకు ఉన్నాయని చెబుతుంటారు. ఇప్పుడు తను తీవ్రంగా విమర్శించి ఓడించడానికి ప్రయత్నించిన బీజేపీనే చంద్రబాబు టార్గెట్ చేసుకున్నారు. ఆ పార్టీతో పాతపగలు అన్ని మరిచిపోయి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట..

ఈ మేరకు టీడీపీ నుంచి వలసవెళ్లిన రాజ్యసభ ఎంపీలతోపాటు గతంలో టీడీపీ బలంతో గెలిచిన ఎంపీలను మచ్చిక చేసుకునే పనిలో చంద్రబాబు పడ్డారన్నది ఇన్ సైడ్ టాక్.

నరేంద్రమోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని చంద్రబాబు దేశంలోని అన్ని రాష్ట్రాలకు తిరిగి అందరూ నేతలను కలిశారు. కానీ పాపం నవ్విన నాప చేనే పండింది అన్నట్టుగా మోడీ గెలిచి.. చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. దీంతో చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు.. బీజేపీపై పల్లెత్తు మాట కూడా అనడం లేదు.

వైసీపీ టార్గెట్ గా ముందుకుసాగుతున్న చంద్రబాబు ఈ క్రమంలో ఎదురవుతున్న బీజేపీని, ఆ పార్టీ అధ్యక్షుడు కన్నాను పల్లెత్తు విమర్శలు చేయకపోవడం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. దీన్ని బట్టి చంద్రబాబు బీజేపీని మచ్చిక చేసుకునేందుకే బీజేపీ నేతలతో సఖ్యతతో ప్రయత్నిస్తున్నట్టు టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించి పాత పగలను త్యజించి మళ్లీ పూర్వవైభవం తెచ్చుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారట.. మరి ఈ ప్లాన్లు వర్కువుట్ అవుతాయో లేదా చూడాలి మరీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -