Wednesday, April 24, 2024
- Advertisement -

సీఎం జ‌గ‌న్‌కు మాజీ సీఎం చంద్ర‌ బాబు లేఖ‌

- Advertisement -

ఏపీ సీఎం జగన్‌కు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మొద‌టి సారి లేఖ రాశారు. అమరావతిలోని ప్రజావేదికను ప్రతిపక్ష నేత అయిన తనకు కేటాయించాలని లేఖలో కోరారు. తన నివాసానికి అనుబంధంగా ప్రజావేదికను కేటాయించాలని అందులో విజ్ఞప్తి చేశారు. తాను ఉంటోన్న ఇంటిలో ఖాళీ స్థలం ఏమీ లేనందున, ప్రతిపక్ష నేత హోదాలో తనకు ప్రజా వేదికను కేటాయించాలని కోరారు.

మంగళవారం చంద్రబాబు నాయుడితో పార్టీ నేతలు సమావేశమై..తన నివాసం, పార్టీ కార్యాలయంపై చర్చించారు. ప్రజావేదిక చంద్రబాబు ఉంటోన్న ఇంటికి అనుబంధంగా ఉండటంతో పార్టీ నేతలు, ప్రజలతో సమావేశం కావడానికి అది అనుకూలంగా ఉంటుందని నేతలు సలహా ఇచ్చినట్టు సమాచారం. అందుకే బాబు సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో అయితే ఉన్నానో దానిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రైవేట్ ఓనర్‌తో షరతుల మేరకు ఇంటిని వినియోగించుకుంటున్నానని లేఖ‌లో పేర్కొన్నారు. చంద్రబాబు విజ్ఞప్తికి సీఎం జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -