ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు..
మరోవైపు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటూనే అధికార పక్షంలో ఉన్నలు ఫీల్ అవుతున్నారు.. అందుకే తాను ముఖ్యమంత్రి పదవి లో ఉన్నానన్న భ్రమలో బతుకుతూ ఉన్నాడు.. మొదటినుంచి జగన్ ను ఇంకా ప్రతిపక్ష నేతగా చూస్తూ ముఖ్యమంత్రి అని చూడకుండా ఓ పార్టీ సాధారణ కార్యకర్తలా విమర్శిస్తున్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి విషయంలో జగన్ ను చంద్రబాబు పెట్టిన ఇబ్బంది అందరికి తెలిసిందే.. మరోవైపు తన మనుషుల తో ప్రభుత్వం పై కేసులు వేసి పైశాచిక ఆనందం పొందారు.. తన అనుకూల మీడియాలో జగన్ పై దుష్ప్రచారం చేయడం ద్వారా జగన్ పై మెచ్చే వేసే ప్రయత్నం చేశారు..
కానీ జగన్ తన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.. రోజు రోజు కి గ్రాఫ్ పెంచుకుంటున్నారు.. అయితే దీనిపై చంద్రబాబు దుబారా ఖర్చు చేస్తున్నారు ఆరోపణలు చేయడం ఒకింత విమర్శకు దారి తీస్తుంది. మన్మోహన్ సింగ్ వంటి ఆర్థిక నిపుణులు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ అనుసరిస్తున్న విధానాలే సరైనవని పేర్కొంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ చంద్రబాబు అండ్ కో మాత్రం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా ఆరోపణలు చేయడం చంద్రబాబు కుళ్ళు తనానికి నిదర్శనంగా మారుతుంది.
రాష్ట్రానికి చంద్రబాబు ఇప్పుడొచ్చి ఏం చేద్దామని..?
చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?