Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పై రెచ్చిపోయిన చంద్రబాబు

- Advertisement -

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు రెచ్చిపోయారు. రెండోరోజు స్పీకర్ తమ్మినేనిపై ఫైర్ అయ్యారు. ఏకంగా బెదిరింపులకు దిగారు. స్పీకర్ తమ్మినేని సీతారం కూడా చంద్రబాబుకు గట్టి కౌంటర్లే ఇచ్చారు. దీంతో సభలో స్పీకర్-చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

సభ రెండోరోజు ప్రారంభం కాగానే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని దీనిపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అదే సమయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడడానికి స్పీకర్ అనుమతించారు.

దీంతో తమ వ్యతిరేకి మాట్లాడితే తమకు ఇబ్బంది అని భావించిన టీడీపీ ఎమ్మెల్యేలు వంశీ మాట్లాడుతుంటే అడ్డుకున్నారు. అభ్యంతరం తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని టీడీపీ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు.

అయితే దీనిపై కలుగజేసుకున్న చంద్రబాబు స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ ఆఫీసు కాదని.. మీరు ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని స్పీకర్ పైర్ అయ్యారు.

దీనికి స్పీకర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారో అన్ని తెలుసని.. కావాలంటే చూపించమంటారా అని బాబుకు స్పీకర్ గట్టి బదులిచ్చారు. దీంతో స్పీకర్-చంద్రబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. స్పీకర్ తీరును నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -