Friday, April 19, 2024
- Advertisement -

జగన్ ను కలవబోతున్న చిరు.. ఎందుకో తెలుసా ?

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసెందుకు అపాయింట్‍మెంట్ కోరారట మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరు మంచి ఉత్సాహంలో ఉన్నారు. ఆయన నటించిన సైరా చిత్రం సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక ప్రస్తుతం సైరా ను మరింత ప్రమోట్ చేయడంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు.

ఇదే టైంలో ఏపీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ ను కూడా కోరారట చిరు. జగన్ ను చిరు కలవడం వెనుక చాలా ఆసక్తికరమైన రీజన్లు ఉన్నాయట. సైరా మూవీ గురించి సీఎం వివరించాలని మెగాస్టార్ భావిస్తున్నారట. అలానే సీఎం గా ఎన్నికైనందుకు కూడా జగన్ కు కంగ్రాట్స్ తెలియజేయాలని చిరు అనుకుంటున్నారట.

జగన్ సీఎం అయ్యాక చిరు ఆయనతో సమావేశం కాలేదు. వీరిద్దరు కలిసి కూడా చాలా కాలం అయింది. ఈ క్రమంలో వీరి సమావేశం ఆసక్తిదాయకంగా మారే ఛాన్స్ ఉంది. అయితే చిరు ఎప్పుడు కలిసేది అపాయింట్ మెంట్ ఇంకా ఖారారు కాలేదని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -