Friday, March 29, 2024
- Advertisement -

అన్న రాంబాబుకి క్లాస్ పీకిన సీఎం జగన్.?

- Advertisement -

నిన్న ఒంగోలులో నాడు-నేడు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ప్రకాశం జిల్లాకి చెందిన అందరూ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో జగన్ ఎమ్మెల్యే అన్నరాంబాబు మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే అన్నరాంబాబు నియోజకవర్గ కేంద్రమైన గిద్దలూరులో లేకుండా మార్కపురంలో ఉంటూ అక్కడికి రమ్మని వాళ్లతో గంటలు గంటలు ఎదురు చూపులు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం జగన్ కడిగేసినట్టు తెలిసింది. ఇక వైసీపీ వాళ్లకు కాకుండా నీ వెంబడి ఉంటే పక్కా టీడీపీ వాళ్లకే స్విఫ్ట్ ఆపరేటర్స్ కు డబ్బులు ఇస్తున్నావని.. వాటర్ ట్యాంక్స్ అంతా వాళ్లకే అన్ని ఇచ్చారని ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. ఇక రెడ్డి సామాజికవర్గం ను పూర్తిగా పక్కన పెట్టేసి చేస్తున్నావ్ అని జగన్ గద్దించినట్టు సమాచారం.

ఇప్పటికే పలు వివాదాల్లో అన్న రాంబాబు వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు జగన్ సీరియస్ కావడంతో ఇప్పుడు ఇది ప్రకాషం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -