Friday, April 19, 2024
- Advertisement -

పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఎమ్మెల్సీ రాజ‌గోపాల్ రెడ్డి

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం ఇచ్చిన షోకాజ్ నోటీసుల‌పై స్పందించారు ఎమ్మెల్సీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి.షోకాజ్ నోటీసులకు సమాధానం రెండు రోజుల్లో చెప్పామన్నారని రెండు రోజులు కాదు రెండు గంటలు చాలన్నారు. త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు అక్క‌ర్లేద‌ని పార్టీ నాశ‌నం అవుతుంద‌నే అవేద‌న‌తోనే మాట్లాడాన‌న్నారు.

తాను మాట్లాడిన మాటలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన అని, తాను ఈవిధంగా మాట్లాడటం కొంత మంది ఓర్వలేకనే తనకు షోకాజ్ నోటీసులిచ్చారని విమర్శించారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకుంటున్నానని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నానని అన్నారు.

పీసీసీ ప్రకటించిన కమిటీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ వాస్తవమా కాదా ఆత్మ పరిశీలన చేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.సీఎం ఎలా కావాలని అనుకుంటున్న వారే తప్ప, పార్టీని గెలిపించే వారు కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పిన రాజగోపాల్ రెడ్డి, రాహుల్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు.

రాజకీయాల్లో నన్ను రెచ్చగొట్టేందుకు కొందరు నాపై కుట్రపన్నారని మండిపడ్డారు. అందులో భాగమే షోకాజ్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. తనలాంటి క్రమశిక్షణ కలిగిన నాయకులను కోల్పోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -