Tuesday, April 23, 2024
- Advertisement -

క‌న్ను కొట్ట‌డంలో ప్రియా వారియ‌ర్‌ను రాహుల్ మించిపోయారే..

- Advertisement -

గ‌త ఏడారి పార్ల‌మెంట్ స‌మావేశాల్లో భాజాపా ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం స‌మ‌యంలో …రాహుల్ క‌న్నుకొట్ట‌డం దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. తాజాగా అదే సీన్ లోక్‌స‌భ‌లో రిపీట్ అయ్యింది. రఫేల్‌ ఒప్పందంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మరోసారి కన్ను గీటుతూ కెమెరాల కంటపడ్డారు. రఫేల్‌ ఒప్పందంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

రాఫెల్ డీల్ కు సంబంధించి అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చర్చ ఘాటుగా సాగుతున్న సమయంలో రాఫెల్ కన్నుకొట్టారు. నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడిన అనంత‌రం అన్నాడీఎంకే నేత ఎం.తంబిదురై ప్రసంగిస్తుండగా రాహుల్ బల్లపై చరిచి అభినందించారు. ఆ తర్వాత వెనుక ఉన్న నేతతో ఏదో చెబుతూ కన్ను కొట్టి కెమెరాకు చిక్కారు.

ఇదే అంశంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్నుగీటడం వంటి చర్యలపై క్షమాపణలు చెప్పారా అని రాహుల్‌ను నిలదీశారు. నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యల అనంతరం రాహుల్‌ మరోసారి కన్నుకొడుతూ కెమెరాల కంటపడ్డారు. ఇది ఇప్పుడు సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -