Wednesday, April 24, 2024
- Advertisement -

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌..

- Advertisement -

ద‌ళితులను అవ‌మానించే విధంగా టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనిపై రాష్ర వ్యాప్తంగా వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది.దళితులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావ‌డంతో ద‌ళితులు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో చింత‌మ‌నేని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అంటే టీడీపీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్ర‌భుత్వం వెంట‌నే నాపై నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేయాల‌ని.. నాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఏమిటో తేల్చాలని కోరిన చింతమేని అనుచ‌రుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

ప్ర‌తిప‌క్ష పార్టీలు ద‌ళిత ద్రోహిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని..తాను ద‌ళిత ప‌క్ష‌పాతిన‌ని తెలిపారు. నా వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చేలా సోషల్ మీడియా వేదిక దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -