Saturday, April 20, 2024
- Advertisement -

వైఎస్‌ఆర్‌కి అర్దం ఏంటో చెప్పిన దేవినేని ఉమ..!

- Advertisement -

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. “వైసీపీలో వై అంటే-వైవీ సుబ్బారెడ్డి(మీ బాబాయ్)కి 5 జిల్లాలు,ఎస్‌-సాయిరెడ్డి(ఆర్థిక నేరాలు)కి 3 జిల్లాలు, ఆర్‌-రామకృష్ణారెడ్డి(సాక్షి, ప్రభుత్వ సలహాదారు)కి 5 జిల్లాలు పంచారు. సెర్చ్ కమిటీల్లో12, వర్సిటీ ఈసీల్లో 46 మంది మీ బంధువులే.

మీ ప్రభుత్వ పెత్తందారీ నియామకాలపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం ఉందా?’ అని దేవినేని ఉమ నిలదీశారు. పార్టీ బాధ్యతలు, రాష్ట్రంలోని ముఖ్య వ్యవహారాలు ముగ్గురికే ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. ఏపీలోని 13 జిల్లాలను ముగ్గురికి పంచారంటూ సీపీఐ నేతలు చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి.

ఆ ముగ్గురికి మాత్రమే ఎందుకు ఇస్తున్నారని, వైసీపీలో ఇంకెవరూ సమర్థులు లేరా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించినట్లు అందులో ఉంది. మిగతా కులాలను డమ్మీ చేశారని, రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆయన విమర్శలు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయం సజ్జల రామకృష్ణారెడ్డికి, అనుబంధ విభాగాలు విజయసాయి రెడ్డికి అప్పగించరని అన్నారు.

సెంటిమెంట్ ను పక్కన పెట్టేసిన జగన్.. కానీ..!

సీఎం జగన్ పై పూరి జగన్నాధ్ ప్రశంసలు..!

కృష్ణ జిల్లాలో ఆ వైసీపీ ఎమ్మెల్యే టాప్ లో ఉన్నాడట..!

సంక్షోభ సమయంలోనూ సంక్షేమానికి పెద్దపీట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -