Thursday, March 28, 2024
- Advertisement -

టీడీపీ నేతలకు ఇస్మార్ట్ శంకర్ తో కౌంటర్ ఇచ్చిన వైసీపీ..

- Advertisement -

సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీ మధ్య ట్విట్ర్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కేశినేని నాని సైలెంట్ గా ఉన్నారు. తాజాగా ఇప్పుడు వరద రాజకీయం మరో సార వేదికయ్యింది. చంద్రబాబు నివాసంపై వైసీపీ-టీడీపీ నేతల మధ్య రగడ నడుస్తోంది. వరద కృత్రిమంగా సృష్టించారని టీడీపీ ఆరోపిస్తుంటే.. వరదల్ని సృష్టించడం ఏంటంటూ వైసీపీ కౌంటరిస్తోంది.

దీంతో ట్విట్టర్ లో ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా ఈ వివాదంపై వైసీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్) టీడీపీని టార్గెట్ చేశారు. చంద్రబాబు గారు స్థాపించింది పాల ఫ్యాక్టరీనా? లేక పప్పుల ఫ్యాక్టరీనా? అని పీవీపీ ప్రశ్నించారు. ప్రపంచంలోనే శ్రేష్ఠమైన పప్పులను చంద్రబాబు తయారుచేసి వదులుతున్నారని టీడీపీ నేతలను పరోక్షంగా ప్రస్తావించారు.

అంతేనా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.కృతిమ వరదలు పుట్టించడం ఏంటి సర్జీ..కాస్త వాళ్ల బుర్రలో ismart chips పెట్టండి’అంటూ టీడీపీ నేతలపై సెటైర్లు వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -