Saturday, April 20, 2024
- Advertisement -

చంద్రబాబుకు షాక్ : టీడీపీ కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై..!

- Advertisement -

ఏపీలో విపక్ష టీడీపీకి మరో షాక్ తగిలిందుకు రెడీగా ఉందా..? ఓ సీనియర్ నేత పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నారా ? ఆయన ఇప్పటికే తమ కుటుంబానికి ప్రయరిటీ లేకపోతే పార్టీ మారుతామని అల్టీమెటమ్ కూడా జారీ చేశారా ? అంటే అవుననే టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీ సీనియర్ నేత సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు కొద్దిరోజులుగా టీడీపీలో ఉక్కపోతతో ఉంటున్నారు. గత ఎన్నికలకు ముందు నుంచే రాయపాటి చంద్రబాబుపై గుస్సాతో ఉన్నారు.

తన కుమారుడు రాయపాటి రంగరావు పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ ఐదేళ్ళపాటు ఎంతో కష్టపడ్డారని.. అయితే ఎన్నికల్లో వేళ గుంటూరు నుంచి ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇవ్వాలని అడిగిన చంద్రబాబు పట్టించుకోలేదు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత కోడెల శివప్రసాద్ రావు మృతి చెందడంతో సత్తెనపల్లి లేదా మద్దాల గిరి పార్టీ మారడంతో గుంటూరు వేస్ట్ సీటు అయినా వారసుడికి ఇప్పించుకోవాలని రాయపాటి ప్రయత్నాలు చేశారు.

అయిన చంద్రబాబు జిల్లాలో ఖాళీగా ఉన్న బాపట్ల గుంటూరు వేస్ట్ మాచర్ల సీట్లకు ఇన్చార్జ్‌లను నియమించి సత్తెనపల్లి విషయం తేల్చలేదు. ఇక తాజాగా తన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పై దాడులు జరుగుతున్నా చంద్రబాబు లైట్ తీసుకోవడంతో రాయపాటి మరింత రగులుతున్నారట. ఇక రాయపాటికి కొద్ది రోజులుగా బీజేపీ నుంచి ఆహ్వానం ఉంది. ఇక ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా లేరు. ఇప్పుడు కన్నాను ఆ పదవి నుంచి తప్పించారు. పైగా రాయపాటికి జాతీయ స్థాయిలో కూడా బీజేపీ నేతలతో పరిచయాలున్నాయి.

గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్వయంగా గుంటూరు వచ్చి రాయపాటి సాంబశివరావు ను కలవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పుడు రాయపాటి బీజేపీ ఎంట్రీకి ఏపీకీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా అడ్డుపుల్ల వేశారు అని అందుకే ఆయన ఎంట్రీ ఆగిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు రాయపాటి చంద్రబాబు తన కండిషన్లకు ఓకే చెప్పకపోయినా తన వారసుడి రాజకీయ భవిష్యత్ కోసం ఏదో ఒక సీటు ఇవ్వకపోయినా పార్టీలో తను ఉండను బయటకు పోతానని వార్నింగ్ కూడా ఇచ్చారట. చంద్రబాబు ఇలాగే నానిస్తే రాయపాటి నేరుగా ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిపైన పార్టీ మారాలని చూస్తున్నారట. అదే జరిగితే టీడీపీలో మరో వికెట్ పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వైసీపీలోకి గంటా.. డేట్ కూడా ఫిక్స్.. క్లారిటీ వచ్చేసింది..!

చంద్రబాబు, లోకేశ్ కు షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు.. ?

టీడీపీకి అమరావతి.. వైసీపీకి విశాఖ.. మరి జనసేనకు ?

బాలయ్య, పవన్ చేస్తే తప్పు లేదు.. నేను చేస్తే తప్పా ? : ఎమ్మెల్యే…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -