Saturday, April 20, 2024
- Advertisement -

బీజేపీలోకి వెళ్లే టీడీపీ నేతలు వీళ్లేనా?

- Advertisement -

టీడీపీలో అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని పరిస్థితి నెలకొంది. నలుగురు నమ్మిన బంట్లు, టీడీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరడంతో ఇప్పుడు టీడీపీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని పరిస్థితి నెలకొంది.

తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ప్రతీసారి రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారుతూ అధికారంలో కొనసాగే గంటా శ్రీనివాసరావు టీడీపీని మారే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నా గంటా శ్రీనివాసరావుకు వ్యాపారాలున్నాయి. ఇక టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో ఆయన ప్రతిపక్షంలో కొనసాగుతున్నారు. టీడీపీలో రాజకీయ జీవితం ఆరంభించిన గంటా అనంతరం ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనమై మంత్రి పదవి పొందారు. ఇక 2014 వేళ టీడీపీలో చేరి గడిచిన హయాంలో కూడా మంత్రి అయ్యారు.

తాజాగా గంటా శ్రీనివాస్ రావు తనతోపాటు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారే యోచనలో ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే గంటా బీజేపీ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లారని.. కొంతమందితో కలిసి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల్లోనే గంటా టీడీపీకి షాకిస్తారని అంటున్నారు. చూడాలి మరి గంటా .. గంటకొట్టేదెప్పుడో..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -