- Advertisement -
వైసీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీనుంచి అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్యాన్ గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సుమారు 40మంది టీడీపీ నేతలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గిద్దలూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ఆధ్వర్యంలో అర్థవీడు ఎంపీపీ రవికుమార్ యాదవ్, జడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎదురు శ్రీనివాస్రెడ్డి, ఉడముల సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.