Friday, April 19, 2024
- Advertisement -

సీఎం జగన్ కు లేఖ రాసిన బాలయ్య.. దేనికోసం ?

- Advertisement -

ఏపీలో జగన్ సర్కార్ కొత్త నిర్ణయాలవైపు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్దమవుతుంది. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రతి పార్లమెంటు స్థానాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలంటూ బాలకృష్ణ తన లేఖలో కోరారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు దగ్గరగా ఉండటంతో పాటు హిందూపురంకు అనేక అనుకూలతలు ఉన్నాయని తెలిపారు.

ఈ విషయంపై బాలకృష్ణ.. ముఖ్యమంత్రి జగన్ కే కాకుండా.. సీఎస్ నీలం సాహ్నీకి కూడా లేఖ రాశారు. అలానే హిందూపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి లేఖ రాశారు. హిందూపురంలో మలుగూరు ప్రాంతంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి అనువైన స్థలం ఉందని.. హిందూపురం జనాభా, ఇతర అవసరాలను పరిగణలోకి తీసుకుని ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మించాలని ఆయన కోరారు.

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. అన్ని ఆసుపత్రిల్లో కరోనా ఉచిత చికిత్స..!

కేసీఆర్ కంటే జగనే బెటర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎవరికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి : వైఎస్ షర్మిల

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.. దద్దరిల్లిన సోషల్ మీడియా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -