Friday, March 29, 2024
- Advertisement -

హిందూపురం వైసీపీలో ట్విస్ట్… తెరపైకి ఎంపీ అభ్యర్థి భార్య స‌విత‌

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌చారంలో దూసుకుపోతుంటె హిందూపురం ఎంపీ అభ్య‌ర్ధి ఎవ‌ర‌నేది ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఒక వైపు నామినేష‌న్ల గ‌డువు స‌మీపిస్తున్నా వైసీపీ త‌రుపు నుంచి ఇంకా నామినేష‌న్ ప‌డ‌లేదు. ఆ స్థానంనుంచి వైసీపీ త‌రుపు ఎంపీ అభ్య‌ర్ధిగా గోరంట్ల మాధవ్ ను జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే అత‌ని వీఆర్ఎస్‌ను ప్ర‌భుత్వం ఆమోదించ‌క‌పోవ‌డంతో నామినేష‌న్ వేసే విష‌యంలో స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. అయితే తాజాగా మాధ‌వ్ భార్య స‌విత‌ను ఎంపీ అభ్య‌ర్ధిగా తెర‌మీద‌కు వ‌చ్చారు.

మాధ‌వ్‌ను విధుల‌నుంచి రిలీవ్ చేయాల‌ని ట్రైబ్యున‌ల్ ఆదేశించినా ప్ర‌భుత్వం మాత్రం ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు… రెండు ఛార్జ్‌మెమోలు పెండింగ్‌లో ఉన్నందునే మాధవ్ వీఆర్ఎస్ ఆమోదం తెలపలేదని ఏపీ పోలీసు శాఖ పేర్కొంది. దీనిపై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్ట‌నుంది హైకోర్టు.

సోమవారం చివరి రోజు కావడంతో మాధవ్‌ నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తనకు క్లియరెన్స్ రాకపోతే తన భార్య సవిత నామినేష‌న్ వేయ‌డానికి సిద్ద‌మ‌య్యారు మాధ‌వ్‌. శనివారం ఉదయం మాధవ్‌ హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సవితకు బిఫారం ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -