తెలంగాణా రెండో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం రేపు చేయనున్నారు. 88 స్థానాలు సాధించి మరో సారి అధికారంలోకి వచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా..అయితే ఇప్పుడు మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. టీఆర్ఎస్ను ఓడించేందుకు బాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆంధ్రారాజకీయాల్లో జోక్యం చేసకుంటామని ప్రకటించారు.
భాజాపా, కాంగ్రెస్ పార్టీలపై కూడా కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. పేరుకే జాతాయా పార్టీలు అయినా రాష్ట్రానికో మాట మాట్లుడుతున్నాయని విమర్శలు చేశారు. దేశంలోని రైతాంగం తరపున తానే ఆ పనికి పూనుకుంటానని కేసీఆర్ స్పష్టం చేశారు నోట్ల రద్దు చెడ్డ కార్యక్రమం ఏమీ కాదని కేసీఆర్ అన్నారు. అయితే దాన్ని మోదీ ఎందుకో మధ్యలోనే ఆపేశారని వ్యాఖ్యానించారు. రైతు బంధు పథకం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నది తన అభిమతమన్నారు.
ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబునాయుడుకే అవగాహన లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసు ప్రాసెస్లో ఉందని కేసీఆర్ వెల్లడించారు. బాబు తెలంగాణాకు వచ్చి గిఫ్ట ఇచ్చారని..మేము కూడా తిరిగి గిఫ్ట్ ఇస్తామన్నారు. బాబుకు కేసీఆర్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో అని ప్రజలు, రాజకీయ నాయకులు ఎదురుచూస్తున్నారు.