దేశ ప్రధాని నరేంద్రమోడీని కలవడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నించిన అపాయింట్ మెంట్ రద్దు అయ్యింది. చైనా అధ్యక్షుడు పర్యటనలో మోడీ ఉండటంతో.. జగన్ తో బేటీ క్యాన్సల్ అయింది. ఇక జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటి కూడా రద్దు అయింది. కొన్ని కారణాల చేత ఈ భేటి రద్దయినట్లు తెలుస్తోంది.
శుక్రవారం మార్నింగ్ 11 గంటలకు జగన్ ను కలవడానికి చిరు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయింది. అయితే చివరి నిమిషయంలో ఇది క్యాన్సల్ అయింది. వీరి భేటి ఆక్టోబర్ 14కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా నరసింహా రెడ్డి సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో చిరంజీవి నరసింహా రెడ్డి పాత్ర పోషించాడు. ఈ చిత్రంను సీఎం జగన్ కు చూపించడానికి అపాయింట్ మెంట్ కోరారు.
ఏపీలో సైరా మూవీ షోస్ పెంచుకునేందుకు జగన్ అనుమతి ఇవ్వడంతో ఆయనను మర్యదపూర్వకంగా కలవడానికి చిరు ప్రయత్నించారు. అయితే జగన్ ను చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాంటిది జగన్, చిరు భేటి కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ వీరి భేటి రద్దు కావడం గమనార్హం.