Saturday, April 20, 2024
- Advertisement -

క‌డ‌ప జిల్లా టీడీపీలో ఆందోళ‌న‌…నంద్యాల ఉప ఎన్నిక‌కుముందే వైసీపీలో సీనియ‌ర్‌నేత చేరిక‌

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడికి మాట త‌ప్ప‌డం వెన్నుతో పెట్టిన విద్య‌.అవ‌స‌రం ఉన్నంత సేపు ప‌ద‌వులు ఇస్తాన‌ని ఊరించ‌డం అవ‌రం తీర‌గానే దూరంగా జ‌ర‌గ‌డం తెలిసిందే.తాజాగా ఇప్పుడు మ‌రో మాజీమంత్రికి బాబు హ్యాండ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.స‌ద‌రు నేత పార్టీ మార‌డానికి సిద్ధంగా ఉన్నారు.
నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌లు శిల్పా,గంగుల త్వ‌ర‌లోనే వీరి స‌ర‌స‌న మ‌రో నాయ‌కుడు చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.నియేజ‌క వ‌ర్గంలో త‌న బ‌ద్ద శత్రువును పార్టీలోకి చేర్చుకొని…మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో స‌ద‌రు నేత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని ఊరించి చివ‌రికి చేతిలో చిప్ప పెట్టాడంట‌.
జ‌మ్మ‌ల‌మ‌డుగు నియేజ‌క‌వ వ‌ర్గ టీడీపీ సీనియ‌ర్‌నేత రామ‌సుబ్బారెడ్డి గ‌త కొన్ని రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ బుబుకు త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.దీంతో ఈమ‌ధ్య‌నే పీఆర్‌ను అమ‌రావ‌తికి పిలిపించుకొని బుజ్జ‌గించిన‌ట్లు తెలుస్తోంది.ఆదితో క‌ల‌సి ప‌నిచేయాల‌ని త్వ‌ర‌లోనే ఆర్టీసీ ఛైర్మెన్ ప‌ద‌విని ఇస్తాన‌ని చెప్పినా రామ‌సుబ్బారెడ్డి తిర‌స్క‌రించార‌ట‌.గ‌తంలో రామ‌సుబ్బారెడ్డి బంధువులు జ‌గ‌న్‌తో క‌లిసి రామ‌సుబ్బారెడ్డి గురించి చ‌ర్చించారు.
వ‌చ్చె ఎన్నిక‌ల్లో టీడీపీనుంచి టికెట్ ఇవ్వాల‌ని కోర‌గా అందుకు బాబు స‌సేమీరా అన్నట్లు తెలుస్తోంది.చేసేదేమిలేక రామ‌సుబ్బారెడ్డి జ‌గ‌న్‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. మీరు ఒక సారి మాట ఇస్తే త‌ప్ప‌ర‌నే భావంతోనే వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్ప‌డంతో జ‌గ‌న్‌కూడా సానుకూలంగా స్పందించారు.
నంద్యాల ఉప ఎన్నిక‌కుముందే పీఆర్ వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నారంట‌.పైగా ఆదినారాయ‌న‌రెడ్డిపై ఉన్న వ్య‌తిరేక‌త బాగా క‌ల‌సి వ‌స్తుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోందిట‌.త్వ‌ర‌లోనే పీఆర్ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును ప్ర‌క‌టించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -