Thursday, April 25, 2024
- Advertisement -

జ‌న‌సే యాక్స‌న్ ప్లాన్ రెడీ…..

- Advertisement -

సోషియ‌ల్ మీడియాకే ప‌వ‌న్ క‌ళ్యాన్‌ప‌రిమిత మ‌య్యార‌ని వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై స్పందించారు. ఇక‌నుంచి ఎక్కువ‌గా రాజ‌కీయాల‌పైనె దృష్టి పెట్ట‌నున్నాని వెల్ల‌డించారు. అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప‌వ‌న్‌ చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ శ్రేణుల ఎంపిక పూర్తయిందని అన్నారు. ఏపీలో రెండు జిల్లాలు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అది అక్టోబర్ కి పూర్తవుతుందని చెప్పారు. సమర్థులైన యువకులను ఎంచుకుంటున్నామని ఆయన తెలిపారు.
జ‌న‌సేన పార్టీ శ్రేనుల ఎంపిక పూర్తయిన తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, వారంలో మూడు రోజులు రాజకీయాలకు కేటాయిస్తానని అన్నారు. గంగపర్రు, పశ్చిమగోదావరి జిల్లాలోని తందుర్రు ఆక్వాపార్క్ ఘటనలపై స్పందించకపోవడానికి కారణమేంటంటే…ఆ రెండూ సున్నితమైన అంశాలని అన్నారు.
అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు లకు కులాలు అంటగట్టడం సమంజసం కాదని ఆయన సూచించారు. ఆక్వాఫుడ్ పార్క్ లో నిబంధనలన్నీ అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు అమలవుతున్నాయా? అని అడిగారు. ప్రతి సమస్య పోలీసులతో అణచివేస్తే సరిపోతుందని ప్రభుత్వం భావించడం సరికాదని ఆయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -