ఎన్నికల్లో పోటీ చేసె అభ్యర్ధులందరూ గెలవాలనే కోరుకుంటారు. గెలవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయడం సహజం. తనును గెలిపిస్తే నియోజక వర్గాన్ని ఎలా అభివృద్ది చేస్తానో ప్రజలకు చెప్పి గెలుపుకోసం ప్రయత్నించాలి కాని పవన్ మాత్రం తన గెలుపు మీద నమ్మకం లేకనె సీమ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
అన్న చిరంజీవి మాదిరిగానె పవన్ రెండు చోట్లు పోటీ చేస్తున్నారు. గాజువాక, భీమరం నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నారు. భీమరం నియోజక వర్గంలో ప్రాచారం చేస్తున్న పవన్ సీమ ప్రజలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనమీద వ్యతిరేకత తెచ్చే విధంగా ఉన్నాయి. జగన్ భీమవరంకి పులివెందుల మనుషులను పంపుతారా? పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోకి పులివెందుల అల్లరిమూకలు ప్రవేశిస్తే తరిమికొట్టతాను అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం అభ్యంతరకరమే కాదు రాయలసీమ ప్రజలను అవమానించడం దారుణం.
ప్రజానాయకుడిగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒకే విధంగా చూడాలి. కాని పవన్ మాత్రం అందుకు విరుద్దంగా సీమ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేడం బాధాకరం. నన్ను గెలిపిస్తే నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్దిచేస్తానని చెప్పిన పవన్…నాలుగు సంవత్సరాలుగా టీడీపీ తో అంటకాగినపుడు భీమవరంకి చేసిన అభవృద్ది చేసిన కృషి ఏంటో పవన్ చెబితే బాగుంటుంది.
ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసిన చిరంజీవిని సొంత ప్రజలు ఓడిస్తే రాయలసీమ ప్రజలు తిరుపతి నుంచి గెలిపించి రాజకీభిక్ష పెట్టారు. అలాంటి ప్రాంత ప్రజలపై గెలుపుకోసం నిందలు వేయడం పవన్కు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజకీయంగా జగన్ పై విమర్శలు చేయచ్చు కాని….అన్యాయంగా పులివెందుల ప్రజలపై నిందలు వేసి రాజకీయ పబ్బం గడుపుకోండాన్ని సీమ ప్రజలు అంగీకరిస్తారా…? నేను గెలిస్తే నియోజక వర్గం అభివృద్దికి ఏలా కృషిచేస్తానో చెప్పాల్సిన పవన్ అందుకు భిన్నంగా జగన్ మీదా రాయలసీమ ప్రజల మీదా నిందలు వేయడం ద్వారా విజయం సాధించాలనుకుంటున్నారు.