జనసేన’ పోరాట యాత్ర ఈరోజు ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైంది. స్థానిక రాజావారి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ , చంద్రబాబు, లోకేష్లపై నిప్పులు చెరిగారు. తాను ఎవరో ఆడిస్తే ఆడే ఆట బొమ్మను కాదని, భయపడే వ్యక్తిని అసలే కాదని అన్నారు. బీజేపీకి భయపడుతోంది తాను కాదని, సీఎం చంద్రబాబేనని, అసలు, ఆయన ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
చంద్రబాబు భయపడటానికి కారణం..ఓటుకు నోటు..లోగుట్టు పెరుమాళ్ల కెరుక’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీని మోసం చేసిన బీజేపీని టీడీపీ నిలదీయలేకపోయిందని, టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
ఇక లోకేష్పై కూడా సెటైర్లు సంధించారు. లోకేష్గురించి చెప్పాల్సిందేమిలేదు..ఆయన సీఎం కొడుకు..మంత్రి. రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా? ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉంది. ఖజానా కూడా వాళ్ల చేతుల్లోనే ఉంది. తాళాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. అంతా వాళ్లిష్టం..వాళ్లేమైనా చేసుకోనీ!’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు