Tuesday, April 23, 2024
- Advertisement -

కుప్పంలో టీడీపీ భూస్థాపితం చేస్తా

- Advertisement -

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే రోజుకో ర‌కంగా వార్త‌ల్లో నిలిచే పాల్ ఈ సారి అన్ని పార్టీల నేత‌ల‌పై విరుచుక‌ప‌డ్డారు. ఏపీని చంద్రబాబు నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబును భూస్థాపితం చేస్తానన్నారు. అక్క‌డితే ఆగ‌కుండా పులివెందులలో జగన్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, చిన్న చిన్న పార్టీలన్నీ తనతో కలిసి రావాలని కోరారు. అన్ని పార్టీలు క‌లిసి వ‌స్తే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామ‌ని పిలుపునిచ్చారు. అంతేకాదు తాను అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి ఓ కార్పొరేట్ ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -