ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అనడానికి ఇదే ఉదహారణ.. ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దు.. స్పెషల్ ప్యాకేజీ ముద్దు అంటూ చంద్రబాబు తీసిన రాగానికి వంత పాడారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. బాబుగారి చెప్పిందే నీతి.. ఆయన నోటి వచ్చిందే ప్రవచనం అని ముందుకు సాగే ఆర్కేకు షాక్ ఇచ్చింది ఇప్పుడు బీజేపీ. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని అంటున్న చంద్రబాబు.. మీ సొంత మీడియా అధినేత ఆర్కే ఏమంటున్నారో వినండి అంటూ ఓ ట్వీట్ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ.
వాస్తవాలను మీ రాజకీయ లబ్ది కోసం అబద్ధాలుగా… యూ-టర్న్ తీసుకుని రంగులు మార్చి యెల్లో మీడియాతో కలిసి ఊసరవల్లి సిగ్గుపడేలా రాజకీయాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని దానికి క్యాప్షన్ ఇచ్చారు కన్నా. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి కలిగే లాభం ఏమీ లేదని రాధాకృష్ణ అంటుండటం కొసమెరుపు.
ఆ రోజుల్లో చంద్రబాబు-మోదీ చెట్టపట్టాలేసుకొని తిరిగే రోజుల్లో చేసిన ఇంటర్వ్యూ.. చంద్రబాబు కూడా అడ్డు చెప్పలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడారు. అదే ఇంటర్వ్యూ ఈ మధ్య చేసి ఉంటే హోదా అవసరం లేదన్న మాట వింటే ఆర్కే అలా కూల్గా ఉండేవారా? ఏపీకి అన్యాయం చేస్తున్నారు అంటూ గగ్గోలు పెట్టేవారు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.