- Advertisement -
తెలంగాణా సీఎంగా మరో సారి కేసీఆర్ కావాలని ఆంధ్రాయువకుడు ఎవరూ చేయని సహాసానికి ఒడిగట్టాడు. గతంలో కేసీఆర్ ఆంధ్రకు వెళ్లిన సమయంలో ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున కటౌట్లు వెలిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంధ్రా యువకుడు కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ.. తన నాలుకను కోసి దేవుడి మొక్కు తీర్చుకున్నాడు.
స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన బంజారాహిల్స్లోని బుధవారం ఓ ఆలయంలో చోటుచేసుకుంది.తన నాలుకను కోసి ఉండీలో వేశాడు. దీంతో, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడిని అక్కడి వారు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడ్డ యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేష్ గా గుర్తించారు.