తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.చంద్రబాబబుని ఇక్కడ తంతే అక్కడ పడ్డాడు.ఈసారి మీరు ఇచ్చే తీర్పుతో మళ్లీ మన రాష్ట్రం వైపు చూడాలంటే చంద్రబాబుకి వెన్నులో వణుకు పుట్టాలని ఆయన తెలిపారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖనాపూర్ లో గురువారం నాడు నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు చిన్న మనిషా.. పెద్ద మనిషి.. ఏడాది పాటు కేంద్రం, ఆంధ్రప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టారని కేసీఆర్ చెప్పారు. ఎక్కువ కాలం పాటు హైద్రాబాద్ లోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్లాన్ చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ కు చేతకాక ఆంధ్రకు పోయి చంద్రబాబునాయుడును తెలంగాణకు తీసుకువస్తున్నారని చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్ర చంద్రబాబునాయుడును తీసుకువస్తున్నారని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ ఓడిపోతే నాకు వచ్చే నష్టం లేదు. తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం వస్తే ఎవరికీ లాభమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ చిల్లర రాజకీయం కోసం చంద్రబాబునాయుడును తెచ్చుకొంటారా అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తాయి పోతాయి గెలవాల్సింది నాయకులు కాదు.. ప్రజలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.