దుబ్బాక లో రోజు రోజు కి రాజకీయ వాతావరణం మారిపోతుంది.. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయం కాస్త వేడిగా మారిపోయింది.. పార్టీ లు అన్నీ విమర్శలు చేస్తూ ఎదుటి పార్టీ ని కృంగదీసే ప్రయత్నం చేస్తున్నాయి.. చేరికలు ఒక పార్టీ నుంచి మరో పార్టీ కి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎ పార్టీ ఎప్పుడు పుంజు కుంటుందో అర్థం కావట్లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరకు శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే వేయనున్నారు.. ఇక్కడ ప్రచారానికి రేవంత్ రెడ్డి వంటి వారు వస్తున్నారు. దీంతో అధికార పార్టీ కి గట్టి పోటీ ఖాయం అని తెలుస్తుంది..
ఇక అధికార పార్టీ పూర్తి గా హరీష్ రావు నే నమ్ముకుందని చెప్పాలి.. అయన తన సొంత నియోజకవర్గంలా ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నారు.. కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై శ్రద్ధ వహించగా, కేటీఆర్ గ్రేటర్ పై ద్రుష్టి సారించారు.. దాంతో హరీష్ రావు కి దుబ్బాక ని ఇచ్చారు.. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలుపు ఢంకా మోగించాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారట.. సాదా సీదా విజయం కాదు ఇక్కడి గెలుపు తో విర్రవీగిపోతున్న ప్రతిపక్షాల నోళ్లు మూయించేలా గెలుపు కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారట..
గత ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డికి వచ్చిన ఓట్లకు మించి ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని కేసీఆర్ అన్నారట.. ఇందులో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని దాదాపుగా అన్ని గ్రామాలను మంత్రి కలియ తిరిగారు. అంతటితో ఆగకుండా మండలాలకు ఎమ్మెల్యే స్థాయి నాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. అదేవిధంగా తనదైన శైలిలో కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువతతో సమీక్షలు, సభలు నిర్వహంచి టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. అయితే కొంతమంది తెరాస నాయకులూ హరీష్ రావు కి కేసీఆర్, కేటీఆర్ కొంత సపోర్ట్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.. ప్రతిపక్షాలు అన్ని ఏకతాటి గా ఉన్నాయి, అధికార పార్టీ తరపున హరీష్ రావు ఒక్కడే అయిపోయాడు అని భావిస్తున్నారట.. మరి కేసీఆర్ ఎలక్షన్స్ టైం కల్లా వచ్చి పార్టీ ని మరింత బలం గా మారుస్తాడా అన్నది చూడాలి..
టీఆర్ఎస్ అంతకుమించి ప్లాన్ చేసిందా..?
హరీష్ రావు వద్దకు దుబ్బాక ప్రజలు.. మాట ఇస్తున్నారా..?