Saturday, April 20, 2024
- Advertisement -

ట్రంప్ తో కేసీఆర్ ఏం మాట్లాడారంటే ?

- Advertisement -

నిన్నటితో అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన కంప్లీట్ అయింది. ట్రంప్ అమెరికా వెళ్లే ముందు అధ్యక్షుడి గౌరవార్దం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భారీ విందు ఇచ్చారు. ఈ విందుకు దేశంలోని అతి ముఖ్యమైన ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఈ విందుకు ఆహ్వానించారు. ప్రత్యేకమైన విమానంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. విందుకు ముందు.. పరిచయ కార్యక్రమంలో ట్రంప్ కు సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి పరిచయం చేశారు. ట్రంప్ రాగానే కేసీఆర్ ముందు నమస్కారం చేశారు. తర్వాత కరచాలనం చేశారు. పురోభివృద్ధి రాష్ట్రమైన తెలంగాణకు ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్ ను పరిచయం చేశారట. ఇదే సందర్భంలో ట్రంప్ తో కేసీఆర్ మాట కలిపారు.

‘గతంలో హైదరాబాద్ లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో మీ కుమార్తె ఇవాంక ట్రంప్ హాజరయ్యారని.. అది మా హైదరాబాద్ అని గుర్తు చేశారట..’.. కేసీఆర్ మాటలకు ట్రంప్ చిరునవ్వు నవ్వుతూ ‘అవును.. నాకు తెలుసు’ అని చెప్పినట్టు గా తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -